హోప్ ఫౌండేషన్ సేవలను SBI ఏజీఎం పల్లం రాజు ప్రశంసించారు

హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – ఎస్‌బీఐ ఏజీఎం పల్లం రాజు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా చందానగర్‌లో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పల్లం రాజు కొనియాడారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా, శనివారం 168వ వారం అన్నప్రసాద.

ముఖ్య అతిథిగా హాజరైన పల్లం రాజు, తన కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం కంటే మించిన సేవ లేదని, హోప్ ఫౌండేషన్ గత 168 వారాలుగా నిర్విరామంగా ఈ యజ్ఞాన్ని కొనసాగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
​క్రమశిక్షణతో కూడిన ఏర్పాట్లు
​వందలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా హోప్ ఫౌండేషన్ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు ఘాలి కృష్ణ, ఆపర్ణ, మధుసూధన్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version