జర్నలిస్టుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

జర్నలిస్టుల మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ వేదికగా జర్నలిస్టులు జాతీయస్థాయి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని
ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో బుధవారం
ఈ నెల 23,24 తేదీలలో నిర్వహించే నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఇండియా) (ఎన్‌యూజే(ఐ)) జాతీయ సమావేశాల వాల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఎన్‌యూజే(ఐ) అనుబంధ యూనియన్ అయిన తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్
(టిఎస్ జెయు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల జర్నలిస్ట్ ప్రతినిధులు హాజరయ్యేలా,హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు.జర్నలిస్టుల సమస్యలపై చర్చించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ,కార్యక్రమ నిర్వాహకులైన టీఎస్‌జేయూ రాష్ట్ర,జిల్లా కమిటీలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు అరిగేల జనార్ధన్,గట్టు రవీందర్,ధన్వాడ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version