పద్మశాలి ముద్దుబిడ్డ కొండి కుమార్ కు ఘన సన్మానం..

పద్మశాలి ముద్దుబిడ్డ కొండి కుమార్ కు ఘన సన్మానం

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పదవ వార్డు సభ్యునిగా ఘన విజయం సాధించిన పద్మశాలి ముద్దుబిడ్డ కొండి కుమార్ భూపాలపల్లి జిల్లా ప్రాంత పద్మశాలి సంఘం శ్రీ బార్గవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై ప్రజాసేవకు అంకితమైన కొండి కుమార్ భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని ఆకాంక్షించారు. పద్మశాలి సమాజానికి గర్వకారణమైన ఈ విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సన్మానం అందుకున్న కొండి కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు, తనకు అండగా నిలిచిన పద్మశాలి సంఘం, శ్రీ బార్గవ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ
,ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రాంత పద్మశాలి సంఘజిల్లా అధ్యక్షులు గొనే బాస్కర్ తొపాటు జిల్లా నాయకులు బాగవతం బిక్షపతి క్యాతం సతీష్ కుమార్, కుసుమ కృష్ణమోహన్,వీరాస్వామిల తొపాటు శ్రీ బార్గవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాటేటి శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి పేరాల వేంకటేషం, శేర్ కుమారస్వామి,దాసరి సుదర్శన్,ఎల్ల శంకరయ్య ,రవిందర్,బడుగు వెంకటేషం,హరి క్రిష్ణ, గుండేటి రాజయ్య పాల్గొన్నారు.

సచ్చినా భూములు ఇవ్వం…

సచ్చినా భూములు ఇవ్వం………”

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: దేశానికి రైతు వెన్నుముక అంటున్నారు.సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను పరిశ్రమల పేరిట తీసుకోవడం సమంజసం కాదని, ఇప్పటికే 2 వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చాం. ఇకముందు సచ్చినా భూములు ఇవ్వం అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి రైతులు ముక్తకంఠంతో రెండో విడత భూసేకరణను వ్యతిరేకించారు. గ్రామంలో రైతులు ఆందోళన చేస్తారని అనుమానంతో జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌) భూసేకరణలో భాగంగా మంగళవారం ఎల్గోయి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీబాయి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిమ్జ్‌ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్ తిరుమలరావు, స్థానిక రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. గ్రామంలో రెండో విడత భూసేకరణలో 103 మంది రైతులకు గాను 195 ఎకరాల భూముల భూసేకరణ అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. గతంలో గ్రామంలో 1,800 ఎకరాలకు పైగా భూమిని పరిశ్రమల కోసం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గతంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతుల అభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో మేము ప్రాణాలైనా అర్పిస్తాం, భూములు మాత్రం ఇచ్చేది లేదు అని తేల్చిచెప్పారు. సభఅనంతరం తహసిల్దార్ తిరుమలరావు సభ మినిట్స్ను రైతులకు వివరించారు. రైతులకు ఎంత నచ్చజెప్పినా ఒక్క రైతు కూడా సంతకం పెట్టలేదు. సంతకాలు పెట్టకుండా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version