ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

#ఆర్టీసీ సంస్థ మనందరిదీ దానిని కాపాడుకునే బాధ్యత ప్రయాణికులదే.

# నర్సంపేట డిఎం ప్రసన్న లక్ష్మి

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజిఎస్ ఆర్టిసి ) ఆర్టీసీ బస్సు లో ప్రయాణం అన్ని రకాల భద్రతతో పాటు సురక్షితమని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి పేర్కొన్నరు
శుక్రవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లో గల సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఇటీవల డైల్ యువర్ డిఎం కార్యక్రమా ద్వారా ప్రయాణికుల సూచనలను సలహాలను స్వీకరించి వారి కోరిక మేరకు అదనపు బస్సు ట్రిప్పులను ఆయా ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం నిమిత్తం పెంచడం జరిగిందన్నారు.
ఆర్టీసీ మన సంస్థ దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రైవేట్ వాహనాల ప్రయాణం వద్దు మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం ముద్దు అని ప్రయాణికులకు తెలియజేశారు.
సమయపాల పాటించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రయాణికులు. స్థానికులు. తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version