సంత్ సేవాలాల్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

సంత్ సేవాలాల్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..

 

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

అమరావతి: గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..
ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అహింస, మానవత్వం, సమానత్వానికి సేవాలాల్ మార్గదర్శనం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సేవాలాల్‌ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు చూపిన శాంతి మార్గాన్ని, ఆయన బోధించిన జీవన విలువలను మనసారా స్మరించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

కాగా, ఉండవల్లిలోని తన కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 287 జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’రూ.50లక్షలు కేటాయించి సేవాలాల్‌ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తాం. ఆయన మన రాష్ట్రంలో జన్మించడం మనందరి అదృష్ట

సేవాలాల్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శమే. సేవాలాల్‌ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. నీట్‌, ఐఐటీ సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తాం. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేస్తున్నాం. 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించాం’ అని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version