నిర్లక్ష్యంతో రూ.40 లక్షల డ్రైనేజీ పనులు గల్లంతు

గత పాలకుల నిర్లక్ష్యంతో 40 లక్షల డ్రైనేజీ పనుల గల్లంతు

-దోమలతో రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు

ముత్తారం :- నేటి ధాత్రి

గ్రామాల పరశుభ్రత,అభివృద్దే ధ్యేయంగా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారు 40 లక్షలతో నిర్మాణం చేసిన డ్రైనేజ్ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారింది.గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెరాస పాలకుల పట్టింపులేని కారణంగా,పాలకులే డ్రైనేజ్ పూడ్చి వేయడంతో పాటు వారి అనుచరులు సహితం అదే బాటలో నడిచి డ్రైనేజ్ నుండి నీరు బయటకు వెళ్ళకుండా చేశారు.అప్పుడు డ్రైనేజ్ నిర్మాణం పనులు చేసిన గుత్తేదారు మద్య మద్యలో వదిలేసి,నిర్మాణం అసంపూర్తిగా చేసారు.దీంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి పోవడంతో చెత్తా చెదారం జమ అయి అవి దోమలకు ఆవాసాలుగా మారాయి.

దీంతో నిరుపేదలైన గ్రామస్తులు రోగాల బారినపడి లక్షలాది రూపాయలు ఆసుపత్రిలో ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోయారు.దీనికి తోడు ఎవరి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి కాని డ్రైనేజ్ లతో పనేంటి అని అధికారులతో మాట్లాడిస్తున్నారని వాపోతున్నారు.ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించు కోవడం లేదు. డ్రైనేజ్ ని కూడిపిన వారే మాజీ ప్రజాప్రతినిధులు కావడం,అధికారులతో సన్నిహితంగా ఉంటూ,అడిగిన వారిని పట్టించుకోవడం లేదని,దీంతో తమ గోడు ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని తెలిపారు.పైగా డ్రైనేజ్ సిల్ట్ ను తీసివేయమన్న వారిని పోలీసులతో సైతం బెదిరించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని పూడ్చివేసిన డ్రైనేజ్ లను పునరుద్దరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version