అన్ని మతాల సారం ఒక్కటే..
◆-: ఘనంగా ‘అలియా ఇవాద్ మసీద్’ ప్రారంభోత్సవం మత సామరస్యాన్ని గౌరవించడం మన కర్తవ్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: పట్టణంలోని ఆదర్శ్ నగర్లో నూత
నంగా నిర్మించిన ఆలియా జవాద్ మస్జిద్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి మరియు జహీరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. ఏ. చంద్రశేఖర్, ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, మరియు మున్సిపల్ చైర్మన్ మొహ్మద్ యూనుస్ హాజరయ్యారు. ముఖ్య అతిథులు మస్జీ దీన్ను ప్రారంభించి, ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో శాంతిని, సోద రభావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. అన్ని మతాలను గౌర విస్తూ సోదరా భావం తో ముందుకు వెళ్లాలని, అన్ని మతాలసారం ఒక్కటే అని అన్నారు. మస్జీద్ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ షబ్బీర్ అలీ అభినందించారు. జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి, మైనా రిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలియా జవాద్ మస్జిద్ కమిటీ అధ్యక్షులు జేజే మీర్ జవీర్అలీ, కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం సోదరులు మరియు పెద్ద సంఖ్యలో మత పెద్దలు పాల్గొన్నారు.
