సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాలలో వెలుగులు

సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాలలో వెలుగులు

భూపాలపల్లి నేటిధాత్రి

సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో రేగొండ, చిట్యాల కొత్తపల్లిగోరి టేకుమట్ల, మొగుళ్ళపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లోని మొత్తం 191 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.61,10,500/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ.అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సుంకరి రామచంద్రయ్య అప్పం కిషన్ సాంబమూర్తి తోట రంజిత్లబ్ధిదారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version