మంకాల్.సుజాత గారి పార్థీవదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారి సతీమణి మంకాల్ సుజాత గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.సోమవారం వారి స్వగృహంలో మంకాల్.సుజాత గారి పార్థీవదేహానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాళులర్పించారు.అనంతరం మంకాల్ సుభాష్ గారికీ మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఉండాలని ఓదార్చారు.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ.నాగిరెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్,బి.మల్లికార్జున్,జగదీశ్,కాశీనాథ్ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
