మహంకాళి దేవలయం 26వ వార్షికోత్సవం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల మహంకాళి దేవలయం 26వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న స్వామి ఆద్వర్యంలో వివిధ రకలైన పూజ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. మహంకాళి దేవలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో బోనాలు, రంగము, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.