కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మాల్లోసారి మోసపోవద్దు.. గోసపడొద్దు..

కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మాల్లోసారి మోసపోవద్దు.. గోసపడొద్దు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ గారు* పాల్గొని 15వవార్డ్ బసవేశ్వర్ స్ట్రీట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మజ గారిని 28 వ వార్డ్ అర్యనగర్ మడపతి శివ కుమార్ స్వామి గారిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గత ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు .ప్రజలారా ఆలోచించండి కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి మల్లోసారి మోసపోయి గోసపడొద్దు.బిఆర్ఎస్ పాలనలో ఎట్లుండే..ఇప్పుడెట్లున్నది ఆలోచించండి.పరకాల పట్టణ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఒక్కపైస పనిచేయలేదు.బిఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులేసి మేమే చేసినామని గప్పాలు గొడుతున్నారు.వాళ్లేని మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు.ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు.ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపుతామని ప్రజలు వేచి చూస్తున్నారన్నారు ప్రజల ఆశీస్సులతో జహీరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version