డా,,దూడపాక రమేష్ ను సన్మానించిన మంద కృష్ణ మాదిగ…

డా,,దూడపాక రమేష్ ను సన్మానించిన మంద కృష్ణ మాదిగ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సు లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేతులమీదుగా మొగుళ్ళపల్లి మండలం ఆకినపల్లి గ్రామానికి చెందిన దూడపాక రమేష్ ఇటీవల గోవా రాష్టంలో నిర్వహించిన సాహిత్య రంగంలో. డ్రీం అచీవ్ మెంట్ అవార్డ్స్ 2025 రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డు తో పాటు 21వ సెంచరీ బుక్ అఫ్ రికార్డు వారు గోవా రాష్ట్రంలో నిర్వహించిన సదస్సులో డాక్టరేట్ ను పొందిన సందర్భంగా డాక్టర్. దూడపాక రమేష్ ను శాలువాతో గౌరవంగా సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ గౌరవమైన డాక్టరేట్ విడివిధానాలను గూర్చి తెలుసుకొని మాట్లాడుతూ. పేద కుటుంబంలో నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి డాక్టరేట్ పొందడం చాల సంతోషంగా ఉందని మంద కృష్ణ మాదిగ దూడపాక రమేష్ ను ఆప్యాయంగా అభినందనలు తెలియజేసారు. దూడపాక రమేష్ సాహిత్య రంగంలో తన సాహిత్యంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందాలని మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని మంద కృష్ణ మాదిగ ఘనంగా సన్మానించారు. అనంతరం డా,,దూడపాక రమేష్
(యువకవి మద్దాలి అవార్డు గ్రహీత) మాట్లాడుతూ. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత. మంద కృష్ణమాదిగ అన్న చేత సన్మానం పొందడం గొప్ప అనుభూతి గా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ. మంద కృష్ణ దీవెనలతో నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న, ఆశీర్వాదంతో అలాగే నా స్నేహితుల ప్రోత్సాహంతో నేను ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నత స్థాయికి రావడానికి తప్పకుండా కృషి చేస్తానని దూడపాక రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు జీడి సంపత్, దూడపాక శ్రీనివాస్, అడ్వికెట్ భిక్షపతి, ఎం ఆర్ పి ఎస్. గ్రామ అధ్యక్షుడు గడ్డం రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version