హైకోర్టు జడ్జిలను కలిసిన పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు
పరకాల,నేటిధాత్రి
శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కేంద్రంలో 10+2 నూతన జిల్లా కోర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్బంగా హైకోర్టు జడ్జిలు జస్టిస్ వేణుగోపాల్ రావు,నామవరపు రాజేశ్వర్ రావులను పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెండల భద్రయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జడ్జి సీహెచ్ రమేష్ బాబు,బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారి,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కారే,అధికారులు న్యాయవాదులు పాల్గొన్నారు.
