నాలుగో తేదీన జరిగే సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయండి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి..

నాలుగో తేదీన జరిగే సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయండి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా ఈనెల నాలుగో తేదీన కరీంనగర్ నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బహిరంగ సభ కరపత్రాన్ని సిపిఐ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం, పెట్టుబడి దారి విధానానికి వర్గ దోపిడీకి, శ్రమ దోపిడీకి, వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రచారోద్యమాలు నిర్వహించటానికి 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో సిపిఐ కరీంనగర్ లో బహిరంగ సభ రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొని ఎన్నో కేసులను ఎదుర్కొని జైల్లో నిర్బంధించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ప్యూడల్ వ్యవస్థను బద్దలు కొట్టేందుకు వందేళ్లుగా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం సర్కార్ ను గద్దెదించడానికి దేస్
ముఖులు, రజాకార్ లను ఎదిరించటానికి వెట్టి చాకిరి విముక్తి కోసం భూమికోసం భుక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ అగ్రభాగాన నిలిచిందని ఆమహత్తర పోరాటానికి రావి నారాయణరెడ్డి, మగ్దూo మోహినుద్దీన్, బద్ధం
ఎల్లారెడ్డిలు ముగ్గురు పిలుపునిచ్చారని అందులో బద్దం ఎల్లారెడ్డి కరీంనగర్ జిల్లాకి చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమని, ఆ పోరాటంలో నలభై ఐదు వందల మందికి పైగా కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మూడు వేలకు పైగా గ్రామాలను విముక్తి చేయబడ్డాయని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దేనిని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిపిఐ ముందుండి పోరాడిందని జాతీయస్థాయిలో ఒకే నినాదంతో ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు వినిపించి రాష్ట్రo సాధించేవరకు అనేక పోరాటాలు ఉద్యమాలు, యాత్రలు, పోరు బాటలు నిర్వహించిన పార్టీ కేవలం సిపిఐ పార్టీయేనని అన్నారు. వందేళ్ల ఉత్సవాల సందర్భంగా రెవెన్యూ గార్డెన్లో బహిరంగ సభ జరుగుతుందని దీని విజయవంతం కోసం జిల్లాలోని పార్టీ శ్రేణులు సానుభూతిపరులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈబహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈసమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, నగర కార్యవర్గ సభ్యులు ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం, చెంచల మురళి, మాడిశెట్టి అరవింద్, భాకం అంజన్న, బెక్కంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ వందేండ్ల పండుగను జయప్రదం చేయండి..

సిపిఐ వందేండ్ల పండుగను జయప్రదం చేయండి

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు సంసిద్ధం కావాలి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

డిసెంబర్ 26కి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతుందని వంద సంవత్సరాల దినోత్సవం రోజు కరీంనగర్ నగరంలో పార్టీ జెండాలను ఆవిష్కరించి వందేళ్ల సిపిఐ త్యాగాలు విజయాలను, ప్రజలకు తెలియజేయాలని, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిపిఐ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ కరీంనగర్ నగర కౌన్సిల్ సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా జరిగిన పోరాటాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఘనమైన చరిత్ర ఉన్నదని కమ్యూనిస్టు పార్టీ లేకపోతే తమకు ఎవరు పోటీ ఉండరనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పోరాట ఉద్యమ చరిత్ర వక్రీకరిస్తుందని ఆయన ఆరోపించారు. సిపిఐ పార్టీ పుట్టి వంద సంవత్సరాలయిందని ఇది దేశంలో పోరాటం చేసిన చరిత్ర ఏపార్టీకి లేదన్నారు. బిజెపి పాలకులు కాంగ్రెస్ కి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గొప్పగా చెప్పుకుంటుందని వల్లభాయ్ వల్లనే హైదరాబాద్ విలీనం అయ్యిందని చరిత్ర వక్రీకరిస్తుందని విమర్శించారు. మద్దు మోయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణరెడ్డి సాయుధ పోరాటానికి పిలిపిచ్చారని అప్పటికీ పదిలక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు ప్రజలకు పంపిణీ చేశారని దీంతో హైదరాబాద్ కమ్యూనిస్టుల వసం అవుతుందనే భయంతోనే హైదరాబాదులో విలీనానికి ఒప్పందం జరిగిందని వారు గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట దేశంలో మారణహోమం సాగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కులు, జీవనోపాదులు, గౌరవ జీవితానికి ఉన్న హామీని అణిచి వేస్తుండడంపై రాజి లేని పోరాటం చేస్తామని ఆయన ఈసందర్బంగా తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటం నుంచి ఆతర్వాత ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, ఉపాధి, గృహ సమస్యలపై విరోచిత పోరాటం చేసింది సిపిఐ అని దాని ఫలితంగానే అనేక చట్టాలను హక్కులను సాధించుకున్నామని అందుకే కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ వంద సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని అలా చేస్తే కమ్యూనిస్టులకు రావాల్సిన ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బ్యాంకుల జాతీయకరణ చేశారని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారని కానీ మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణ, కార్పొరేట్ ల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్రం వ్యవసాయ కార్మికుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని నిలదీశారు. కరీంనగర్ నగరంలో కమ్యూనిస్టు పార్టీకి కార్పొరేటర్ లేక పోయినప్పటికీ పేదల భూమి పంపిణీ చేపట్టిందని, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇప్పించిందని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర సిపిఐకి కరీంనగర్ లో ఉందన్నారు. భవిష్యత్తులో సిపిఐ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని మతోన్మాద బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం, చెంచల మురళి, కసి బోసుల సంతోష చారి, మాడిశెట్టి అరవింద్, సత్యనారాయణ చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version