ఆర్ కొత్తగూడెంలో మైరాడ్ సంస్థ మొక్కల పంపిణీ”

మైరాడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్ కొత్తగూడెం గ్రామంలో మొక్కల పంపిణీ

మైరాడ్ సోషల్ మొబిలైజర్ వి నవీన్

నేటిధాత్రి చర్ల

 

మైరాడ సోషల్ మొబలైజర్ వి నవీన్ చర్ల మండలం కలివేరు గ్రామంలో ఐటీసీ యమ్ ఎస్ కె బంగారు భవిష్యత్తు సంస్థ సహకారంతో మైరాడ స్వచ్చంద సంస్థ సభ్యులు ఆర్ కొత్తగూడెం గ్రామం సత్యనారాయణ పురం కలివేరు ఉప్పరిగూడెం పంచాయతీలకు బయోడే వర్సిటీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ మొక్కల వలన జీవవైవిద్య అభివృద్ధి జరుగుతుందని వాతావరణ సమతుల్యతను కాపాడుతాయని అన్నారు ఈ మొక్కల ద్వారా వాతావరణం లోనీ కాలుష్యం తగ్గి ఆక్సిజన్ శాతం పెరుగుతుందని అన్నారు వాతావరణ కాలుష్యం నుండి కాపాడతాయని గ్రామం లో మొక్కలు పెంచడం పండగ వాతావరణంలాగా ఉంటుందని కలివేరు గ్రామ సెక్రెటరీ ఇర్ప శ్రీరామ్ అలాగే మైరాడ సోషల్ మొబిలైజర్ వి నవీన్ అన్నారు రైతులు మొక్కలు పెంచడం వల్ల ప్రాణవాయువు ఉంటుందని నేటి తరాలకు మొక్కలు చాలా అవసరం అని సమావేశంలో తెలియపరిచారు ఈ సమావేశాల్లో తురం బాలకృష్ణ కల్లూరి నరసింహారావు నాని పాలి బాలకృష్ణ పసుపులేటి పిరి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version