మార్గ మధ్యలో ఆగిన సిబిఎస్ ఈ కాకతీయ స్కూల్ బస్సు.

మార్గ మధ్యలో ఆగిన సిబిఎస్ ఈ కాకతీయ స్కూల్ బస్సు

వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సీబీఎస్సీ కాకతీయ విద్యాసంస్థల బస్సు నడిరోడ్డుపై గత మూడు రోజుల నుండి ఎవరు పట్టించుకోవడంలేదని దీన్ని వెంటనే సంబంధిత అధికారి బస్సును సీజ్ చేయవలసిందిగా బిఆర్ఎస్వి హుజురాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యమా! యజమాన్య నిర్లక్ష్యమా! పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీబీఎస్సీ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విద్యను వ్యాపారం చేస్తూ, ధనార్ధనయ ధ్యేయంగా పనిచేస్తున్న కాకతీయ విద్యాసంస్థల యజమాన్యంపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అలాగే మిగిలిన బస్సులను కూడా పూర్తిస్థాయి ఎంక్వయిరీ చేసి TS 02T 2721 బస్సును వెంటనే సీజ్ చేయాలని కోరుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యజమాన్య నిర్లక్ష్యంపై సంబంధిత అధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని లేనియెడల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version