బెట్టింగ్ ముఠాలకు ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ వార్నింగ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ కీలక విజ్ఞప్తి చేశారు. క్రికెట్ను కేవలం ఒక క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగ్ అనే మాయలో పడి విలువైన జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఇవాళ (నేటి ధాత్రి ) ప్రత్యేక పత్రికలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. గతంలో ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను నిషేధించినప్పటికీ, నిర్వాహకులు ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కొత్త రూపంలో ఈ దందాను కొనసాగిస్తున్నారని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపారు.. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆన్లైన్ ద్వారానే కాకుండా, నగర శివార్లలోని ఫామ్ హౌస్లు, ఇతర రహస్య హస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై కూడా పోలీసుల ప్రత్యేక నిఘా ఉందని స్పష్టం చేశారు.
