మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం…

మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం
పి ఎం శ్రీ జవహర్ నవోదయ నల్గొండ

నేటిధాత్రి చలకుర్తి క్యాంప్:

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా పి ఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ చిలకుర్తి క్యాంపులో మహిళా ఉద్యోగులందరికీ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శంకర్ గారి ఆధ్వర్యంలో పూల మొక్కలు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఈ సమాజంలో మహిళల యొక్క పాత్ర అన్ని రంగాలలో ముందు ఉండాలని ఉపాధ్యాయులు వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులైన ఓఎస్ జానకి ,చంద్రకళ, పి ఈ టి మంజుల రాధా, ఆర్ట్ విజయదుర్గ , టిజిటి ఇంగ్లీష్ రీమా, పి జి టి కెమిస్ట్రీ కళ్యాణి, పిజిటి హిస్టరీ మమత, పిజిటి ఇంగ్లీష్ రాఘవి , మహిళా కౌన్సిలర్ స్రవంతి , కంప్యూటర్ సైన్స్ భాగ్య రేఖ, స్టాఫ్ నర్స్ నిర్మల, అటెండర్ అరుణమ్మ , మట్రన్స్ సరిత, విజయ, మరియు మెస్ వర్కర్స్ సాలమ్మ ,మంగమ్మ,ముత్తమ్మ మొదలగు మహిళా ఉద్యోగులను ఘనంగా శాలువాలు కప్పి సన్మానం చేశారు.
ఉపాధ్యాయులైన భాస్కరాచారి, అమరలింగా చారి, సంతోష్ ,శేఖర్ శర్మ ,గురప్ప, విష్ణుశర్మ ,ఆచార్యులు, రాజేష్ ,మోహన్ , విష్ణు అమోల్ గోజే, మురళి, హేమంత్ , లక్ష్మయ్య తదితర ఉపాధ్యాయ ఉపాధ్యాయేత బృందం కలిసి మహిళా ఉద్యోగులను సన్మానించడం జరిగింది. ఆచార్యులు తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని ఏదైనా సాధించగలరని గడిచిపోయిన కాలానికి ప్రస్తుత కాలానికి ఆడవాళ్ళ పాత్రను గురించి ప్రసంగించడం జరిగింది. విష్ణు శర్మ తెలుగు ఉపాధ్యాయులు స్త్రీ యొక్క గొప్పతనం గురించి ‘యంత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవత’ అంటూ కవిత్వాన్ని వినిపించడం జరిగింది. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ స్త్రీ యొక్క గౌరవం గురించి సమాజంలో స్త్రీ యొక్క పాత్ర గురించి పాఠశాలలో మహిళా ఉద్యోగులు నిర్వర్తిస్తున్న విధులను గురించి ప్రసంగించడం జరిగింది. అలాగే శేఖర్ శర్మ మాట్లాడుతూ మగవారు లేకపోయినా ఆడవారు సంసారాన్ని సమాజాన్ని తన శక్తిని ఉపయోగించి ముందుకు తీసుకెళ్లగలుగుతుందని గౌతమ బుద్ధుని భార్య అయిన యశోదర గురించి చెప్పడం జరిగింది. అన్ని ఆలోచించగల ధైర్యం ఆడవారికి ఉంది అని శేఖర్ శర్మ సైన్సు ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. అలాగే సత్యనారాయణ టీజీటీ హిందీ ఉపాధ్యాయులు తన యొక్క కవిత్వాన్ని వినిపించడం జరిగింది. గురప్ప మహిళా దినోత్సవాన్నీ పురస్కరించుకొని మాట్లాడుతూ తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా స్త్రీ యొక్క పాత్రను గురించి వివరించడం జరిగింది. సమాజంలో ఆడవారికి ఉండే పాత్రను గురించి అందరూ మాట్లాడారు తర్వాత మహిళా ఉద్యోగులందరికీ శాలువాలు మరియు పువ్వుల మొక్కలు ఇచ్చి వారిని సన్మానించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు

వివిధ రంగాల్లో ఉన్న మహిళలకు సత్కారాలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో భాగంగా రాజకీయంగా మహిళా మణులు, మహిళ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మాట్లాడుతూ… సమావేశంలో మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర గురించి అంతా ఇంతా చెప్పలేము అని అలాగే మహిళల అభివృద్ధి కోసం నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, విద్యా అవకాశాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై చర్చించారు.
అదే విధంగా మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు, మహిళలకు సమాన హక్కులు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏం సి చైర్మన్, టౌన్ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, వైస్ ప్రెసిడెంట్ రోజా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, అన్ని మండలాల అధ్యక్షురాలు, జిల్లా కార్యవర్గం టౌన్ కార్యవర్గం అందరూ కూడా కాంగ్రెస్ మహిళా సోదరీమణులు అందరు కూడా పాల్గొనడం జరిగినది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version