ప్రధాని మోదీ, పుతిన్‏ల మధ్య అరుదైన మొక్క.. ప్రత్యేకతలు ఇవే.

ప్రధాని మోదీ, పుతిన్‏ల మధ్య అరుదైన మొక్క.. ప్రత్యేకతలు ఇవే!

 

శుక్రవారం పుతిన్‌ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్‌ భవన్‌లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జాతీయం,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అలానే శుక్రవారం పుతిన్‌ (Vladimir Putin), ప్రధాని మోదీ (PM Narendra Modi) మధ్య హైదరాబాద్‌ భవన్‌లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, పసుపు రంగులతో ఎంతో స్పెషల్ గా ఉన్న ఈ మొక్క అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ మొక్క పేరు ఏమిటి, దాని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌ను తెగ వెతికేస్తున్నారు.
హెలికోనియా ప్రత్యేకతలు ఇవే:

ఇరు దేశాధినేతల మధ్యలో ఆకర్షణీయంగా కనిపించిన ఆ మొక్క పేరు హెలికోనియా (Heliconia). సానుకూల శక్తికి ప్రతీకగా దీన్ని భావిస్తుంటారు. వృద్ధి, శ్రేయస్సు, సమతుల్యత, సామరస్యాలతో పాటు కొత్త ఆరంభాలు, ముందడుగులకు శుభ పరిణామంగా ఈ మొక్కను భావిస్తారు. అలానే ఇరుదేశాల మధ్య సంబంధాలు , మెరుగుపడటానికి అలాగే అభివృద్ధి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్క గురించి నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాదు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. హెలికోనియా మొక్క ప్రకృతిలోనే ఒక ప్రత్యేక ఆకర్షణ.దీని పువ్వులు రంగురంగులుగా, కళ్లకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే ప్రత్యేక సమావేశాలు, చర్చలు, డిప్లోమాటిక్ ఈవెంట్స్‌లో దీనిని అలంకరణగా ఉపయోగించడం ఒక సాంప్రదాయంగా కూడా మారింది. అలానే అత్యున్నతస్థాయి దౌత్య సమావేశాల కోసం సిద్ధం చేసే గదుల్లో ఏ వస్తువైనా సరే యాదృచ్ఛికంగా ఉంచరు. పూలు, రంగులు, బ్యాక్‌గ్రౌండ్‌ వంటివి పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అందువల్ల, భారత్‌, రష్యా మధ్య స్నేహ బంధానికి, ద్వైపాక్షిక సహకార పురోగతికి ప్రతీకగా హెలికోనియా మొక్కను కావాలనే ఏర్పాటుచేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.

 రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే..

 రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

భారత సంస్కృతి, కళా వైభవానికి అద్దం పట్టేలా ఉన్న పలు బహుమతులను ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చారు. మరి వీటి విశిష్టతలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు ప్రధాని మోదీ పలు బహుమతులను అందజేశారు. భారత సాంస్కృతిక వైభవానికి, హస్తకళా నైపుణ్యానికి, ఇరు దేశాల బంధానికి ఉన్న ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచేలా వీటిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరి ఈ బహుమతుల విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం పదండి (Modi Gifts to Putin).అన్ని కాలాల్లో మానవులకు మార్గదర్శనం చేసే భగవద్గీత రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. నైతికత, స్థితప్రజ్ఞ అలవడేలా, మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసేలా జగద్గురువు శ్రీ కృష్ణుడు అందించిన సందేశాన్ని అక్కడి యువతరానికి చేర్చేలా రష్యన్ భాషలోకి అనువదించి ఇచ్చినట్టు తెలిపారు.పుతిన్‌కు భారత ప్రధాని అస్సాం బ్లాక్‌ టీని కూడా బహుమతిగా ఇచ్చారు. అస్సాం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ టీనే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంప్రదాయక పద్ధతుల్లో ప్రాసెస్ చేసే ఈ టీకి 2007లో జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇలా భారతీయ రుచులకు చిహ్నంగా నిలుస్తున్న టీని ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.అస్సాం బ్లాక్ టీకి జతగా వెండి టీ సెట్‌ను కూడా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడికి ఇచ్చారు. అందమైన డిజైన్‌లు ఉన్న ఈ టీసెట్‌ను పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో రూపొందించారు
ఇక మహారాష్ట్ర హస్తకళల వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న వెండి గుర్రపు బొమ్మను కూడా ప్రధాని మోదీ రష్యా అధినేతకు బహుమానంగా ఇచ్చారు. హుందాతనానికి చిహ్నంగా నిలిచే గుర్రానికి రష్యా, భారత్ సంస్కృతుల్లో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి విలువలకు అద్దం పట్టేలా ఉన్న ఈ గుర్రపు బొమ్మను రష్యా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.చదరంగంలో ఎందరో ప్రతిభావంతులను రష్యా ప్రపంచానికి అందించింది. ఈ వైభవాన్ని ప్రతిబింబించేలా పుతిన్‌కు మార్బుల్ చెస్ సెట్‌ను ప్రధాని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆగ్రాలో దీన్ని రూపొందించారు. అక్కడి కళాకారుల ప్రతిభకు అసలైన నిర్వచనంగా నిలుస్తున్నందున ప్రభుత్వం దీన్ని ఎంపిక చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన కశ్మీరీ కుంకుమ పువ్వును కూడా ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చారు. అత్యంత సుగంధ భరితమైన, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగినందుకు కుంకుమ పువ్వును కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని అధికారులు తెలిపారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version