పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వి హెచ్ పి డిమాండ్

మల్కాజ్ గిరి నేటిధాత్రి

 

 

పశ్చిమ బెంగాల్ లో గత వారం రోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శనివారం నాడు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి అన్ని జిల్లా కలెక్టర్లలో రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. ముర్షిదాబాద్ పరిసర ప్రాంతాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని మతం పేరుతో ఉగ్రవాద సానుభూతిపరులు మారణఖండ చేస్తుంటే అక్కడి మమత బెనర్జీ ప్రభుత్వం చూస్తూ మౌనం వహించడం గమనిస్తే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం హిందువులను బలి చేస్తున్నారని వి హెచ్ పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలు భేరి సునీతా రామ్ మోహన్ రెడ్డి అన్నారు. వెంటనే అక్కడ శాంతి భద్రతలను కాపాడాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మల్కాజ్ గిరి కార్పొరేటర్లు శ్రావణ్, మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ ,తెలంగాణ ప్రాంత గోరక్ష సభ్యులు శివానంద్ ,జిల్లా కార్యదర్శి రజినీకాంత్,సహ కార్యదర్శులు రాజి రెడ్డి,గోపాల్ చారి, గోరక్షా ప్రముఖ్ బాలాజీ, మణిమాల, మాతృశక్తి సంయోజిక పశ్యంతి,స్థానిక బీజేపీ నాయకులు వీకే మహేష్ , సోమ శ్రీనివాస్,బక్క నాగరాజు,కిరణ్ , భజరంగ్ దళ్ అఖిల్ , హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version