విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్.

విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు

 

 

 

 

అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు.

అమృత్‌సర్: మాజీ ఐపీఎస్ అధికారి, అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్‌ సింగ్‌పై ఆప్ ఆద్మీ పార్టీ (AAP) కీలక క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా పార్టీ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

విజిలెన్స్ చర్యలను ప్రశ్నించినందుకే

అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. విజిలెన్స్ ఆపరేషన్ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘మజిథియా జైలులో ఉన్నారు. ఆయనపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టలేదు. ఆయనను ప్రశ్నించడం కూడా జరగలేదు. ఆయన బెయిల్ పొందేందుకు అనుమతించాలి’ అని అన్నారు. మజిథియా నివాసంపై తెల్లవారుజామున దాడులు జరగడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. రాజకీయ వేత్త అయినా, నటుడయినా, డబ్బున్న వాడు, పేదవాడు, మిత్రుడు, శత్రువు ఇలా ఎవరైనా కావచ్చు… ప్రతి కుటుంబానికి ఒక గౌరవం అంటూ ఉంటుంది. ఉదయమే ఇంంటిలోకి చొరబడం తప్పు, అనైతికం..అని ఆయన తన ట్వీట్‌లో ఖండించారు.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వి హెచ్ పి డిమాండ్

మల్కాజ్ గిరి నేటిధాత్రి

 

 

పశ్చిమ బెంగాల్ లో గత వారం రోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శనివారం నాడు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి అన్ని జిల్లా కలెక్టర్లలో రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. ముర్షిదాబాద్ పరిసర ప్రాంతాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని మతం పేరుతో ఉగ్రవాద సానుభూతిపరులు మారణఖండ చేస్తుంటే అక్కడి మమత బెనర్జీ ప్రభుత్వం చూస్తూ మౌనం వహించడం గమనిస్తే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం హిందువులను బలి చేస్తున్నారని వి హెచ్ పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలు భేరి సునీతా రామ్ మోహన్ రెడ్డి అన్నారు. వెంటనే అక్కడ శాంతి భద్రతలను కాపాడాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మల్కాజ్ గిరి కార్పొరేటర్లు శ్రావణ్, మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ ,తెలంగాణ ప్రాంత గోరక్ష సభ్యులు శివానంద్ ,జిల్లా కార్యదర్శి రజినీకాంత్,సహ కార్యదర్శులు రాజి రెడ్డి,గోపాల్ చారి, గోరక్షా ప్రముఖ్ బాలాజీ, మణిమాల, మాతృశక్తి సంయోజిక పశ్యంతి,స్థానిక బీజేపీ నాయకులు వీకే మహేష్ , సోమ శ్రీనివాస్,బక్క నాగరాజు,కిరణ్ , భజరంగ్ దళ్ అఖిల్ , హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version