ఇల్లంతకుంట శ్రీరాములవారిని దర్శించుకున్న దుర్గం సురేష్ గౌడ్ దంపతులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు..తెలంగాణ పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్..డి ఎస్ న్యూస్ ఛానల్ సీఈవో దుర్గం సురేష్ గౌడ్-త్రివేణి దంపతులు గురువారం వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట శ్రీ రాములవారి దేవాలయాన్ని సందర్శించి మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని జర్నలిస్టులు ఆ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంట కలకాలం నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో కలకాలం వర్ధిల్లాలని కాంక్షించారు.