ఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎస్సై నరేష్……!
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:కోహిర్,రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు, ఆత్మీయ మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్ అన్నారు.మంగళవారం కోహిర్ పట్టణంలో ఆటో యూనియన్ వారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముఖ్యఅతిథులుగా కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్, కోహిర్ ఎస్సై ని ఆహ్వానించారు.సోదర భావానికి, మతసమారష్యానికి ప్రతీక ఈ ఇఫ్తార్ విందు అని కొనియాడారు ఎస్సై నరేష్ కుమార్, ఈ కార్యక్రమంలో కోహిర్ ఆటో యూనియన్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
