నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత
కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.
మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..
నేటిధాత్రి నర్సంపేట:
నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,59,000 విలువగల అంబర్ గుట్కాలుగా అంచనా వేశారు. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీబీ మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు.