పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలి…

పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తీసుకు రావాలని చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళ పారిశుధ్య సిబ్బందికి సన్మానం చేసి , వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి మాట్లాడుతూ మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పారిశుధ్య కార్యక్రమాలు మంచిగా చేసి, మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ చంద్ర శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు అందచేసిన శ్రీ రామదాసు సేవ సమితి…

భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు అందచేసిన శ్రీ రామదాసు సేవ సమితి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట నుండి శుక్రవారం భద్రాచలం గోటి తలంబ్రాలను తీసుకెళ్లిన శ్రీ రామదాసు సేవ సమితి ఆకుల సుభాష్ ఆధ్వర్యంలో ఆలయ ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్ కి అందించడం జరిగిందని.భూపాలపల్లి జిల్లా తో పాటు హన్మకొండ ములుగు జిల్లా సేవ సమితి సభ్యులు సుమారు 150 మంది ఈ తలంబ్రాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారని ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.
తనీషా మందిరం నుండి భద్రాచలం పుర విధులలో రామ నామ స్మరణ తో శోభయాత్రగా వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణ సీతమ్మకు చీర సారే పూలు పండ్లు రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించారన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా బాద్యులు బెనికి రాజేందర్ ఆకుల దామోదర్ కురిమిళ్ల తిరుపతి దూలం శంకర్ పనికేల వసంత జీడీ స్వర్ణలత కేశెట్టి స్వామి ములుగు జిల్లా బాద్యులు సకినాల వజ్ర రఘు ఆవుల సుశీల హన్మకొండ జిల్లా బాద్యులు నాయిని సుమలత నాగరాజు నిలబోయిన రజిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version