సీఎం కప్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు…

సీఎం కప్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు

పోటీలకు ఎంపికైన నారాయణ స్కూల్ విద్యార్థిని హ్రీధ్య

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హ్రీధ్య రాష్ట్రస్థాయి సీఎం కప్ తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించినటువంటి సీఎం కప్ జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో మా పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హ్రీధ్య సబ్ జూనియర్ -33 కేజీ బాలికల విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించి ఫిబ్రవరి 18 19 వ తేదీలలో హైదరాబాదులో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రస్థాయి సీఎం కప్ తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకటస్వామి.ఏజీఎం ఎనాలోసిస్ట్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version