ఉగ్రవాదులను తుది ముట్టించాలి.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పహల్గామ్ లో జరిగిన దాడి దురదృష్టకరమని అమాయకులైన 26 మందిని బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని సిరిసిల్ల మజీద్ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ భారత దేశంలో అన్నదమ్ములల కలిసి మెలిసి ఉన్న హిందూ ముస్లింలలో వైశాల్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి దేశంలో కునుకు లేకుండా ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పహల్గామ్ లో అమాయకులైన 26 మందిని బలిగొన్నారని అమాయకులైన వారి ప్రాణాలను బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీద్, రఫీ ఉద్దీన్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version