స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి…

స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 25 ఆస్పత్రులలో నిర్వహించే స్కానింగ్ సెంటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు
బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్ లతో పాటు ఇప్పటికే ఉన్న స్కానింగ్ సెంటర్లకు అనుమతి గురించి అడ్వైజర్ కమిటీ ముందు ఉంచామన్నారు ఆరోగ్యశాఖ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగినది అని తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగరాజు మాట్లాడుతూ లింగ నిర్ధార పరీక్ష చేయడం చట్టరీత్యా నేరం వీరికి కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు
సెక్స్ రేషియో తక్కువగా ఉన్నటువంటి మండలాలు ఒడితల, రేగొండ,కాటారం,చెల్పూర్,మహా ముత్తారం ఆజాంనగర్, నందు విడుదలవారీగా ఆశలకు ఏఎన్ఎం లకు సమావేశం నిర్వహించి డాక్యుమెంట్ ఫిల్మ్ ద్వారా మోటివేట్ చేసే విధంగా ప్లాన్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ కవిత గైనకాలజిస్ట్, డాక్టర్ అనీషా గైనకాలజిస్ డాక్టర్ సుధాకర్ పీడియాట్రిషన్, ప్రసాద్ సోషల్ వర్కర్, శ్రీదేవి డెమో, శౌరిల్లమ్మ డిపిహెచ్ఎన్ఓ మొదలగు వారు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version