సింగరేణి కంపెనీలో వచ్చిన వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి
భూపాలపల్లి నేటిధాత్రి:
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
2024 2025 ఆర్థిక సంవత్సరం పూర్తయిన సింగరేణి యాజమాన్యం కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించకపోవడంలో అంతరాయం ఏమిటి వెంటనే పూర్తిస్థాయిలో లాభాలు ప్రకటించి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న కార్మికులకు లాభాల నుండి 40 శాతం వాటాను కార్మికులకు పంచాలని కార్మికుల పిల్లలకు విద్య కోసం ఉపయోగపడతాయని ఇప్పటికే స్కూలు కాలేజీలు స్టార్ట్ అయినాయని 2024 2025 సంవత్సరం సింగరేణి యాజమాన్యం కార్మికుల పైన పెట్టిన ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసి మూడు నెలలు అవుతున్న సింగరేణి యాజమాన్యం ఇంకా లాభాలను ప్రకటించలేదు లాభాలను ఇంకా ఎప్పుడు వెల్లడిస్తారు కార్మికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు సింగరేణి ఉత్పత్తి ఏడాదిగా పరిగణిస్తారు లాభాల టర్నవర్ను ఏప్రిల్ నుండి మార్చి వరకు లెక్కించి అందులో కొంత శాతాన్ని కార్మికుల ప్రకటిస్తూది ఈసారైనా తమకు రావలసిన వాటాను త్వరగా చెల్లించాలని ఇట్టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకొని వెంటనే యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలి ప్రాతినిత్య కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన చొరవ తీసుకొని లాభాల వాటను ప్రకటింపచేసి కార్మికుల పక్షాన నిలబడాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాద్ రెడ్డి
నామాల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
ఎండి సాజిత్
తదితరులు పాల్గొన్నారు