వైభవంగా దత్త చండీయాగం…

వైభవంగా దత్త చండీయాగం

◆:- అంకురార్పణ చేసిన పీఠాధిపతులు

◆:- వైదిక సారథ్యం వహించిన పండితులు

◆:- యాగంలో పాల్గొన్న 108 మంది రిత్వికులు

◆:- యజ్ఞానికి హాజరైన దంపతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి క్షేత్రంలో ఈనెల 4 మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులుశ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి, ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం ఆధ్వర్యంలో 21 యజ్ఞ గుండమూలలో శ్రీ దత్తాత్రేయ యజ్ఞం,5 గుండములలో యజ్ఞములతో త్యాయాహ్నిక శ్రీ చండి హోమాన్ని వైదిక

మంత్రాలతో శాస్త్రోత్తంగా ప్రారంభమైంది. ఉదయం 10:24 గంటలకు ఆశ్రమ పీఠాధిపతులు యజ్ఞ వాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు, తొలి రోజు శ్రీ దత్త, చండీ మహాయాగం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. గురుపూజతో ప్రారంభమై గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, మంటపారాధన, ఆవాహిత దేవపూజ, శ్రీ యంత్రపూజ, శ్రీ చండీ పారాయణం, మహా మంగళహారతితో మధ్యాహ్నం 4: 05 కు పూర్ణాహుతితో తొలిరోజు యజ్ఞం భక్తిశ్రద్ధలతో ముగిసింది.

శ్రీ దత్త, గాయత్రి మంత్రాలతో బర్దిపుర్ పరిసర ప్రాంతాలు భక్తిపారవశ్యంతో ప్రతిధ్వనించాయి. యాగానికి సుమారు 100 మంది దంపతులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు హాజరై శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శించుకున్నారు. 3 రోజులపాటు యాగం కొనసాగనుంది. జహీరాబాద్ డిఎస్పి సైదా సిబ్బంది పూజలకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30 కి పూర్ణహుతి, మ. 12 గం. లకు స్వామివారికి హారతి, 12. 30 కి అన్నప్రసాద కార్యక్రమలు జరుగునని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version