మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జార్వర్ కొర్ర
లక్ష్మీ ఐఏఎస్
మూడు చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలో పర్యటన
నామినేషన్ ప్రక్రియ, స్ట్రాంగ్ రూముల పరిశీలన
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :
మేడ్చల్ నియోజకవర్గం లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ అబ్జార్వర్ కోర్ర లక్మీ ఐఏఎస్ పరిశీలించారు. మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటలో పర్యటించిన అధికారుల బృందం ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడు మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం మజీద్ పూర్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లను సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు ముందస్తువులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్డిఓ సాంబ శివ రావు, మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్, తహసిల్దార్ సుచరిత పాల్గొన్నారు
