ఎమ్మెల్యేను కలిసిన ఐనవోలు గౌడ సంఘం కమిటీ..

ఎమ్మెల్యేను కలిసిన ఐనవోలు గౌడ సంఘం కమిటీ
గౌడ సంఘానికి కమ్యూనిటీ హాల్, ప్రహరీ మంజూరు చేయాలి
ఎమ్మెల్యేను కలిసి విన్నవించిన మాజీ ఎంపిటిసి బొల్లెపెల్లి మధు
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు

నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐనవోలు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన గౌడ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘానికి స్వంత భవనం నిర్మాణంతో పాటు దాని చుట్టూ కాంపౌండ్ గోడ అవసరాన్ని ఐనవోలు కాంటెస్ట్ సర్పంచ్ బొల్లెపెల్లి మధు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.గౌడ సంఘం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై మధు చొరవ తీసుకుని సమస్యను ఎమ్మెల్యే ముందు ఉంచడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌడ సంఘ భవనం మరియు దాని చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. అలాగే సంఘ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఐనవోలు కాంటెస్ట్ సర్పంచ్ బొల్లెపెల్లి మధు, ఋగ్వేద్ రెడ్డిని ఘనంగా సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

గౌడ సంఘ అభివృద్ధికి మధు చూపిన చొరవ పట్ల సంఘ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా తమ సమస్యలపై ఇదే విధంగా పోరాటం చేయాలని ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version