ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్…
మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ శశిధర్ రెడ్డి, మందమర్రి , కాసిపేట, దేవాపూర్ ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
