చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి

జైపూర్ నేటి ధాత్రి:

జన్నారం ఇంధనపల్లి మండలం వన్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎర్రజుల చంద్ర మౌళి బుధవారం రోజున ఆకస్మికముగా గుండె పోటుతో మరణించడం చంద్రమౌళి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ గురువారం రోజున జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2 నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తోటి అధికారి అకస్మాత్తుగా స్వర్గస్తులవడం బాధాకరమైన విషయమని, ఎర్రాజుల చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,ఆర్డబ్ల్యూఎస్ డిఈ,మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది,జైపూర్ మండలం పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version