ఎన్నికల నియమావాలిని కుంగాలా తొక్కిన జహీరాబాద్ ఎన్నికల అధికారులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు మాణిక్ రావు, చింత ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ నాయకులతో కల్సి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి (ARO) ఫిర్యాదు.అలాగే జిల్లా కలెక్టర్ కు మరియు ప్రధాన ఎన్నికల అధికారులకు కూడా దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేసారు.ఎన్నికల నియామవాలి ప్రకారం రాష్ట్రం మొత్తంలో గెలచిన అభ్యర్థుల పేరులో తెలుగు అక్షరాలా ప్రకారం అభ్యర్థి పేరులోని మొదటి అక్షరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి కానీ జహీరాబాద్ మున్సిపాలిటీలో అధికారులు మాత్రం రాష్ట్రా ప్రభుత్వనికి తలోగ్గి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా అభ్యర్థి పేరులోని మెదటి అక్షరం కాకుండా రాజకీయ పార్టీ పేరులోని మొదటి అక్షరంతో చైర్మన్, వాయిస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లు మొదటగా పిలిచి ఎన్నికలు నిర్వహించారు.ఇదే విషయంలో ఎన్నికల నియామవాలి ప్రకారం మీదటగా బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి అయినా” కట స్రవంతి ” పేరును అధికారులు మొదటగా చైర్మన్ కొరకు పేరును ప్రతిపథటించాలి కానీ అధికారులు మాత్రం ఎన్నికల నియమావాలిని ఉల్లాగించి అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయినా యూనుస్ పెరు ను మొదటగా చైర్మన్ అభ్యర్థి గా ప్రతిపదించి ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చైర్మన్ గా చేశారు అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు తెలిపారు.ఇదే విషయంలో అవసరం అయితే న్యాయపరంగా కూడా మందుకు వెళ్తాము అని చెప్పారు.
