అగ్ని ప్రమాదంలో వస్తువులు ఇల్లు దహనం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరా నగర్ కాలనీలో వానరాశి. శ్రీనివాస్. అనే వ్యక్తికి చెందిన ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం ఇంటిలోని రిఫ్రిజిరేటర్ పెళ్లి అగ్గి ప్రమాదం జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇంటి వారు తెలియజేశారు అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేరని ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇంటిలోని వస్తువులన్నీ కాలి.పోయాయని అలాగే ఇంటిలో 90 వేల నగదు కూడా .కాలిపోయినట్లు. ఇంటి వారు తెలిపారని తెలియజేయడం జరిగిందని. ఇంటిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానం ఉందని వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు అగ్నిప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన దర్యాప్తు చేపడుతామని సంబంధిత అధికారులు పోలీసులు తెలియజేశారు
