తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా కొనుగోలు చేయాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
నర్సంపేట నేటిధాత్రి:
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కోరారు.రాష్ట్ర ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో అకాల వర్షంతో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన మంత్రి బాయిల్డ్ రైస్ పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే దొంతి తెలిపారు. ఈ
కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వరంగల్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు పాల్గొన్నారు.