కవిత కొత్త పార్టీపై రైతులకు అవగాహన కార్యక్రమం

కవిత కొత్త పార్టీపై రైతులకు అవగాహన కార్యక్రమం

25న ఆవిర్భావ సభకు హాజరు కావాలని పిలుపు

పరకాల,నేటిధాత్రి

కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీపై పరకాల పట్టణంలో గల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ బొచ్చు రాజు మాట్లాడుతూ,రైతుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా కొత్త పార్టీ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.ఆవిర్భావ సభకు ప్రతి రైతు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొడపాక సచిన్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version