బీజేపీలో 100 మంది చేరిక

బీజేపీ లో 100 మంది చేరిక
* కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

పార్టీ బలోపేతానికి కంకణ బద్దులై పనిచేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ సమక్షంలో అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షులు కొరివి కృష్ణ అలియాబాద్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి తుంకి భాస్కర్ ఆధ్వర్యంలో అలియాబాద్ మున్సిపల్ లోని మజీద్ పూర్ నుండి ఎం. లక్ష్మారెడ్డి, ఎం గోవర్ధన్ రెడ్డి, రాజ బాబు, హనుమంత్ రావు, నర్సింహా రావు, మందుసూదన్ రెడ్డి, రామకృష్ణ, సందీప్ రెడ్డి, నరేష్, గంగిరెడ్డి, శుభష్ రెడ్డి, అక్షిత్, జ్ఞానేశ్వర్, అభినవ్, ఆనంద్, పంకాజ్, యశ్వంత్, వర గణేష్, అశ్విన్, గౌతమ్, సుహాస్, లోకేష్, రఘు, సునీల్ లతో పాటు సుమారు 100 మంది నాయకులు యువకులకు కండువాకప్పి బీజేపీ లోకి ఎంపీ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ని బలోపేతం చేయాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగరి హృదయ్ కుమార్, యువ నాయకులు వరప్రసాద్ రెడ్డి, బోయిని శివ, సీనియర్ జి. మహేష్, నక్క సత్యనారాయణ, వి. బిక్షపతి, కే. రమేష్, అబ్బగోని శ్రీశైలం గౌడ్, నక్క నరేందర్ గౌడ్,తుంకి రమేష్,శాంతరావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version