నస్కల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర
నిజాంపేట: నేటి ధాత్రి
మండలంలోని నస్కల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రకు వెళ్లి పలు చారిత్రక కట్టడాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సాగరిక మాట్లాడుతూ.. విద్యార్థులకు వివిధ చారిత్రాత్మక కట్టడాలు వాటి విశ్లేషణల గూర్చి అవగాహన కల్పించడానికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. విజ్ఞాన విహారయాత్రలో భాగంగా జూ పార్క్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, అమరవీరుల స్తూపం, సచివాలయం, హైకోర్టు, ట్యాంక్ బండ్ లాంటి వాటిని చూపించడం జరిగిందన్నారు.
