సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహమ్మద్ సమియోద్దీన్..

సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహమ్మద్ సమియోద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామ ప్రజలు చాలా తెలివైనవారు గ్రామాలు అభివృద్ధి చేసేవారినే ఎన్నుకుంటారు.
ప్రముఖ సామాజికవేత్త మనూర్ మండల బెల్లాపూర్ గ్రామ మహమ్మద్ సమియోద్దీన్
మండల పరిధిలోని తమ గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త సమియోద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ సమియోద్దీన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకులు ప్రజలు ఎంతో చైతన్యవంతులని గ్రామాలను అభివృద్ధి చేసే నాయకులను సర్పంచ్ గా వార్డ్ మెంబర్లు గా ఎన్నుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version