ఎస్సీ నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం
ఏప్రిల్ 2 తారీకు వరకు గడువు పొడిగింపు
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ నిరుద్యోగ యువత కోసం అమలు చేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ (2025-26) పథకాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగించినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా ఒక ప్రక టనలో తెలిపారు. బ్యాంకు లింకేజీ ఉన్న పథకాలు రెండు ద్విచక్ర వాహనాలు, ఈవీ మూడు చక్రాల వాహనాలు, వ్యవసాయంలో అగ్రి డ్రోన్ సర్వీసులు, అగ్రి మిషనరీ కామన్ హైరింగ్ సెంటర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, పశు సంవర్ధక పథ కాల్లో పాడి పశువులు పొందడానికి దరఖాస్తు చేసు కోవాలన్నారు. ఉద్యానవన పథకాలు మల్బరీ సాగు, కిసాన్ నర్సరీ, కూరగాయలు, ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చన్నారు. బ్యాంకు లింకేజీలేని పథకాలు బోర్వెల్స్, సబ్మెర్సిబుల్ పంపుసెట్లు, సబ్మెర్సిబుల్ పంపుసెట్లు పైపులైన్, సర్వీసు కలెక్షన్ ఛార్జీలు, ఓఆర్పి లైన్(రూ.1.50 లక్షల వరకు) పొందవచ్చ న్నారు. అర్హులైన వారు గడువులోపు ఎస్సీ కార్పొరే షన్ అధికారిక పోర్టల్ OBMMS online portal ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా విజ్ఞప్తి చేశారు.
