హలో ఉద్యమ కళాకారుడా చలో ఇందిరా పార్క్
ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షు జన్నే యుగేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాల సాధనకై ఈనెల జనవరి 20న ఇందిరా పార్కు ధర్నా చౌక్ హైదరాబాదులో తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్యమ కళాకారుల పోరు దీక్ష వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమ కళాకారుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జన్నె యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధించుకున్నాం. అయినప్పటికీ ఉద్యమ కళాకారులకు ఎలాంటి ఉపాధి లేకుండా నిరాశ్రయులుగా, దీనస్థితిలో బతుకుతున్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సాంస్కృతిక సారధిలో 1000 ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 20వ తేదీన తలపెట్టిన పోరు దీక్షను విజయవంతం చేయాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఉద్యమ కళాకారులందరూ మరియు 33 జిల్లాల కళాకారులందరూ ఈ పోరు దీక్షలో పాల్గొనాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జన్నె యుగేందర్ పిలుపునిచ్చారు.. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కళాకారులు సెగ్గెం శ్రావణ్ , ఏ. రాజేష్, జె.రాజా సడవాల్, ఎం మధుకర్, ఈ సమ్మరాజ్, జి రాజశేఖర్, కొనుకుంట్ల సంధ్యారాణి, తిక్క నిర్మల, జె రాజేశ్వరి, ఏ శోభ, మంద సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.
