నీట మునిగిన మిరప తోటల పరిశీలించిన సునీల్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలము లోని ఎర్రగుంట తాడిచర్ల శివారులోని అధిక వర్షాల కారణంగా నీట మునిగిన మిరప తోటలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ పరిశీలించారు
ఈ సందర్శన సందర్భంగా ఆయన రైతులతో చర్చించి, పంటను రక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తక్షణ చర్యలు
తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు వెళ్లేలా గుంటలు, కాలువలు త్రవ్వి డ్రైనేజీ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. తోట చుట్టూ నీటి ప్రవాహం సులభంగా ఉండేలా కాల్వలు, నాళాలు శుభ్రం చేయాలి. అన్నారు
వేరుల కుళ్ళు వ్యాధి నివారణ
అధిక తేమ కారణంగా వేరుల కుళ్ళు వ్యాధి వచ్చే అవకాశముందని దీని నివారణ కొరకు నీరు తగ్గిన వెంటనే ట్రైకోడెర్మా విరైడే లేదా ప్సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కలిగిన జైవ నాశనకారిని వేర్ల చుట్టూ పిచికారీ చేయాలి.
1 కిలో ట్రైకోడెర్మా + 100 కిలోల పూడి ఆవు పేడ లేదా ఎరువులో కలిపి తోటలో చల్లడం ద్వారా వేరుల వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు.
జీవ సంబంధిత పద్ధతులతో పాటు అవసరమైతే రసాయనిక ఫంగిసైడ్లను కూడా వాడవచ్చని సూచించారు.
రసాయనిక నియంత్రణ చర్యలలో భాగంగా,
వేరుల కుళ్ళు నివారణకు
కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2.5 గ్రా/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
మిరప మొక్కల పునరుద్ధరణ చర్యలు
నీరు తగ్గిన తర్వాత, మొక్కలు తిరిగి పుంజుకునేందుకు హ్యూమిక్ యాసిడ్ లేదా అమినో యాసిడ్ 3 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అలాగే మైక్రోన్యూట్రియెంట్స్ కలిపి పిచికారీ చేయడం ద్వారా మొక్కలు పునరుద్ధరించుకుని ఆకులు తిరిగి పచ్చగా మారుతాయని తెలిపారు.
