మా భూములు యధావి ధిగా చేసి ఇప్పించండి…

మా భూములు యధావి ధిగా చేసి ఇప్పించండి

లీజు డబ్బులు రాక ఆందోళనలో రైతులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తాహ రాపూర్ గ్రామానికి చెందిన భూమి 112 సర్వే నెంబర్ లోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు శుక్రవారం విలేకరుల సమా వేశంలో కొమ్ముల మల్ల య్య,రేణిగుంట్లసదయ్య మాట్లాడుతూ తహరాపూర్ గ్రామ శివారులో 2015- 2016 రోడ్డు విస్తరణ మం జూరు పనుల కోసం గుడేపాడ్ నుండి చెల్పూర్ వరకు రోడ్డు విస్తరణ సందర్భంగా కాటం రవీందర్ తన తండ్రి అయిన తిరుపతిరెడ్డి క్రషర్ వేసి తన వ్యవసాయ భూమిని బలవం తంగా లీజుకు తీసుకోవడమే కాకుండా నివసించడానికి గుడిసెలు వేసుకుంటామని చెప్పడంతో తన వ్యవసాయ భూమికి వెళ్లకుండా ఇంటి వద్ద ఉండి రైతులకు ఎలాంటి విషయం తెలువకుండా తమ వ్యవసాయ భూములోని మొరం రోడ్డువిస్తరణ పను లకు వినియోగించడం జరిగింది. మొరం తీయడం గమనించిన రైతులు వెంటనే అడగడంతో నీ భూములు మీకు యధావిధిగా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి హాని కలిగించమని హామీ ఇవ్వడం జరిగింది ఒక ఎకరానికి 60 వేల చొప్పున రెండు సంవత్సరాలు చెల్లించ డం జరిగింది. ఇప్పుడు డబ్బు లు ఇవ్వకుండా పది సంవత్స రం కాలయాపన చేయడం జరిగింది. రవీందర్ రెడ్డిని తీసుకుని రా! మీకు డబ్బులు ఇస్తాం.

లీజు డబ్బులు ఒకరికి ఏడు సంవత్సరాలు, మరికొం తమంది రైతులకు 8 సంవ త్సరాలు లీజు డబ్బులు చెల్లించాలి. ఎకరానికి 60 వేల చొప్పున రెండు సంవత్సరాల పాటు చెల్లించడం జరిగింది. మా అగ్రిమెంట్ ప్రకారము మా భూమిని చదును చేసి ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా వ్యవసాయ భూమిని ఇస్తే వ్యవసాయం చేసి జీవనం గడుపుకుం టామని దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిని పరిశీలించిన ఎమ్మార్వో

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని తారాపూర్ గ్రామ శివారులో 112 వ సర్వే నెంబర్ను స్థానిక ఎమ్మార్వో తనిఖీ చేశారు హద్దులు దాని విస్తీర్ణం ఏ విధంగా ఉందో తనిఖీ చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి హాని కలిగించకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version