వర్షాకాలం పొంగుడు ఎండాకాలం ఎండుడు.

వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు.. 20 ఏళ్లుగా ఇదే గోస.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని గినియర్ పల్లి గ్రామంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే గ్రామంలో ఉన్న బోరుబావులన్నీ నీటితో పైకి పొంగుతాయి. అదే ఎండాకాలం వచ్చిందంటే బోరు బావులలో నీరు అడుగంటి పోతుంది. నీటి కోసం గ్రామస్తులు ప్రతి ఏటా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పటినుంచి కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఎందుకిలా జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ పరిశోధన చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వతమైన నీటి సమస్య పరిష్కారానికి పాలకులు, అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సమస్యను పరిష్కరిస్తాం: ఎంపీడీవో.

గినియర్ పల్లి గ్రామంలో నీటి సమస్యపై ఝరాసంగం ఎంపీడీవో సుధాకర్‌ను వివరణ కోరగా, నీటి సమస్య ఉంటే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో 4 నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version