13 సెప్టెంబర్ జాతీయ మెగా లోక్ అదాలత్…

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలం గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ,పరిధిలోని ప్రజలకు తెలియ జేయునది ఏమనగా గొడవలు వద్దు-రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి.ఒక వేల ఇంతటితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు కోండి వివాదాలు కావాలా.? రాజీలు కావాలా.? తేదీ. 13-09-2025 వ తారీఖు కోర్టులో “జాతీయ మెగా లోక్ అదాలత్” ఉంది కాబట్టి.మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడును.1. యాక్సిడెంట్ కేసులు, 2. కొట్టుకున్న కేసులు,3. చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు, 4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్నచిన్న దొంగ తనం కేసులు,6,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవి.ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version