అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థపై అనుమానం
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి సుభాష్ కాలనీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు మంచినీరు తాగి అస్వస్థకు గురయ్యారు దీనిపైన జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అధికారులను డిమాండ్ చేశారు
భూపాలపల్లి సుభాష్ కాలనీ గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 13 మంది విద్యార్థులు ఆహారం తిని వాటర్ తాగి అస్వస్థకు గురైన విద్యార్థులను స్థానిక ప్రిన్సిపాల్ వెంటనే 100 పడకల హాస్పిటల్ తరలించి వైద్యం అందించారు కానీ ఘటన జరిగిన దాని యొక్క కారణాలు ఏమున్నాయి ఎవరు చేశారు అనేదానిపై విచారణ జరిపించి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం బాధ్యులు ఎంతటి వారైనా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా సెక్రెటరీ శీలపాక నరేష్ పార్టీ నాయకులు రాజు పాల్గొన్నారు