రాష్ట్ర స్థాయి కిట్ బాక్సింగ్ పోటీకి ఎంపికైన విద్యార్థులు
భూపాలపల్లి నేటిధాత్రి
ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయిబాక్సింగ్ పోటీలకు ఎంపికైన జిల్లా విద్యార్థులు
సెప్టెంబర్ 08.10.2025 నాడు జె ఎన్ ఎస్ , స్టేడియం బాక్సింగ్ హాల్ హన్మకొండ నందు జరిగిన అండర్ 17 ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శశి కమల్ నాథ్ లు రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ పోటీలకు అర్హత సాధించారు.
వీరికి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి హెచ్ రఘు అభినందనలు తెలియచేశారు. వీరు మరెన్నో ఉన్నత స్థాయి క్రీడలలో పాల్గొని జిల్లా కి మంచి పేరు తేవాలని కోరారు.