విద్యార్థులు జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.
చిట్యాల, నేటిధాత్రి :
ప్రతి ఒక్కరు దేశభక్తుని కలిగి ఉండాలి ,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పో లసాని తిరుపతిరావు
సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులు పౌరులు అందరు జాతీయ జెండా ను పట్టుకొని తిరం గా ర్యాలీ నిర్వహించారు
అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావం కలిగి దేశం ధర్మం వైపు పయనించాలని దేశభక్తిని కలవచ్చు కావాలని భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి మనకు స్వాతంత్రం కలుగజేశారని ఈసారి 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని యువత చెడుదారుల వైపు పోకూడదని ప్రతి ఒక్కరు సోదరా భావంతో కలిగి ఉండి మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఎంతోమంది మన దేశం వైపు చూస్తూ దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని మనందరం ఐకమత్యంగా ఉండి అలాంటి వారిని రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బుర్ర వెంకటేష్ గౌడ్ మైదం aశ్రీకాంత్ తీగల జగ్గయ్య సుదగాని శ్రీనివాస్ గుండ సురేష్ మందల మొగిలి గజనాల రవీందర్ చింతల రాజేందర్ మార్తా అశోక్ కదం రాజు తీగల వంశీ నీలి సుధాకర్ రెడ్డి సాదా సాదానందం బుర్ర ఆ భిజ్ఞ బుర్ర వితే ష్ గోల్కొండ అజయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.