అంగన్వాడి సెంటర్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం
తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మాదారం అంగన్వాడి సెంటర్ 3 లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర వేసుకోవాలన్నారు. అలాగే పిల్లలందరూ ఈ మాత్రను తప్పకుండా వేసుకోవాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా పిల్లలు ఈ మాత్ర వేసుకోవాలని అంగన్వాడి టీచర్ కుసునపల్లి మీనా అన్నారు.పిల్లలు ప్రతిరోజు చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనియెడల నులిపురుగులు తయారవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,ఆశ వర్కర్ మల్లేశ్వరి పాల్గొన్నారు.